తెలంగాణలోని సిద్దిపేట పట్టణంలో 130 కేవీ సబ్ స్టేషన్లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఒక్కసారిగా ట్రాన్స్పార్మర్ పేలి మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న స్థానికులు పేలుడు దాటికి బయటకు వచ్చారు. ఈ ఘటనతో పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంది. వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
సిద్దిపేటలో 132 కేవీ సబ్ స్టేషన్లో పేలిన ట్రాన్స్పార్మర్
February 22, 2024
0
Tags