జోర్డాన్‌ డ్రోన్‌ దాడిలో ముగ్గురు అమెరికా భద్రతా దళ సభ్యులు మృతి !

Telugu Lo Computer
0


జోర్డాన్‌లో జరిగిన డ్రోన్‌ దాడిలో అమెరికాకు చెందిన ముగ్గురు భద్రతా దళ సభ్యులు మృతి చెందగా, 'చాలా మంది' గాయపడినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దాడి వెనుక ఇరాన్‌ ప్రోత్సాహక మిలిటెంట్‌ గ్రూప్‌ ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత మధ్య ప్రాచ్యంలో ఇరాన్‌ మద్దతు ఉన్న మిలిటెంట్ల దాడిలో అమెరికా దళాలకు చెందిన సభ్యులు ఇలా ఒక దాడిలో మరణించడం నెలల వ్యవధిలో ఇదే తొలిసారని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, హమాస్‌ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించిన తర్వాత ఇరాక్‌, సిరియాలలో ఉన్న అమెరికా దళాల బేస్‌లపై తరచూ డ్రోన్‌, క్షిపణి దాడులు జరుగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)