దేశంలో 756 కొత్త కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


డిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 756 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం దేశంలో 4వేల 49 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ రిలీజ్ చేసింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో ఐదుగురు చనిపోయారు. కేరళ, మహారాష్ట్రలలో రెండు మరణాలు నమోదు కాగా జమ్మూ కశ్మీర్‌లో ఒక కేసు నమోదైంది. దీంతో మరణాల సంఖ్య 5,33,392 కు చేరుకుంది. ఇక కోవిడ్ -19 నుండి 889 మంది కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసులలో, వీటిలో ఎక్కువ భాగం (సుమారు 92 శాతం) హోమ్ ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారు. రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)