దేశంలో కొత్తగా 605 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో 24 గంటల వ్యవధిలో 605 కొత్త కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 3,643కి చేరినట్లు తెలిపింది. 24 గంటల వ్యవధిలో కర్ణాటక, కేరళలో ఇద్దరు చొప్పున కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్‌ 5 వరకు కొవిడ్‌ కేసులు రెండంకెల స్థాయిలోనే కొనసాగినప్పటికీ.. కొత్త వేరియంట్‌ జేఎన్‌ 1 వెలుగులోకి రావడం, చల్లని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కేసులు మళ్లీ పెరుగుతుండటం గమనార్హం. బాధితుల్లో 92 శాతం హోం ఐసోలేషన్‌లోనే కోలుకొంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)