తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ

Telugu Lo Computer
0


తెలంగాణలో పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేంద్రం పరిధిలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. ఆమెకు అత్యంత కీలకమైన హెచ్ఎండీఏ కమిషనర్ పదవి ఇచ్చింది. సెక్రెటరీగా రిజ్వీ ని నియమిస్తూ ఆయనకు అదనంగా ట్రాన్స్ కో - జెన్ కో చైర్మన్ అండ్ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా సందీప్ కుమార్ జా, డిప్యూటీ సీఎం కు ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా కృష్ణ భాస్కర్ ను నియమించారు. TSSPDCL చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ముషారఫ్ అలీ, TSNPDCL వరంగల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కర్నాటి వరుణ్ రెడ్డి, అగ్రికల్చర్ డైరెక్టర్ గా బి.గోపిని ప్రభుత్వం నియమించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)