బీఆర్ఎస్ జెడ్పీ ఛైర్మన్ గుండెపోటుతో మృతి

Telugu Lo Computer
0


తెలంగాణ లోని జనగామ జడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి గుండెపోటుతో మరణించారు. హనుమకొండలోని రోహిణి అనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. పాగాల సంపత్‌రెడ్డి ప్రస్తుతం జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే, పాగాల సంపత్ రెడ్డికి హనుమకొండలోని చైతన్యపురిలో ఉండగా సాయంత్రం 5:30కి చాతిలో నొప్పి వస్తుందంటూ వ్యక్తిగత సిబ్బందికి చెప్పడంతో ఆసుపత్రికి సన్నిహితులు తరలించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆయన మరణించారు. కాగా, సంపత్ రెడ్డి జనగామ నుంచి బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన పల్లా రాజేశ్వర్​రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో అహర్నిశలు కృషి చేశారని స్థానిక పార్టీ నేతలు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)