ఆప్ఘనిస్తాన్ భూకంపంలో వెయ్యికి చేరిన మృతుల సంఖ్య !

Telugu Lo Computer
0

ప్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతాన్ని కుదిపేసిన భూకంపం ధాటికి మృతుల సంఖ్య భారీగా పెరిగింది. భూకంప విధ్వంసంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వెయ్యి దాటింది. తాలిబన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వేలాది మంది తీవ్ర గాయాలపాలైనట్లు ఐక్యరాజ్య సమితి వర్గాలు వెల్లడించాయి. శనివారం మధ్యాహ్నం వరుసగా ఏడు సార్లు ప్రకంపనలు రాగా , వీటిలో అయిదు తీవ్రస్థాయిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. హెరాత్ జిల్లాలో నాలుగు గ్రామాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం.. హెరాత్ నగరానికి వాయువ్య దిశగా 40 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)