సెమీస్కు చేరిన భారత హాకీ టీం !

Telugu Lo Computer
0

సియా క్రీడల్లో భారత హాకీ జట్టు బంగ్లాదేశ్ ను ఓడించి సెమీ ఫైనల్ కు చేరింది. 12-0 తేడాతో బంగ్లాను భారత్ మట్టికరిపించింది. టీమిండియా తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్ చేశారు. ఈ మ్యాచ్ లో మొదటి నుంచి టీమిండియా ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించింది. రెండో నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ భారత్‌కు తొలి గోల్‌ అందించాడు. ఆ తర్వాత భారత ఆటగాళ్లు కూడా అద్భుత ప్రదర్శన చూపించారు. వరుసగా గోల్స్ చేసుకుంటూ అత్యుత్తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. బంగ్లా ఆటగాళ్లకు గోల్స్ చేసేందుకు సమయం ఇవ్వకుండా చేశారు. దీంతో భారత్ భారత్ 12-0తో చెలరేగారు. మొదటి నుంచి ఆసియా క్రీడల్లో భారత హాకీ ఆటగాళ్లు పటిష్ట ప్రదర్శన కొనసాగిస్తున్నారు. దీంతో 5 గ్రూప్ మ్యాచ్‌లలో 58 గోల్స్ చేశారు. కాగా భారత్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టు కేవలం 5 గోల్స్ మాత్రమే చేయగలిగింది. భారత జట్టు సెమీఫైనల్‌ మ్యాచ్ ను రేపు ఆడనుండగా.. సెమీస్‌లో చైనాతో తలపడే అవకాశాలు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)