మైనర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో 23 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. యూపీలోని మెయిన్పురిలో అతన్ని పట్టుకున్నారు. జూన్ 23వ తేదీన జరిగిన సంఘటనలో అయిదుగురు నిందితులు ఉన్నారు. అదే రోజున ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మరో ముగ్గురు ఆమెను రేప్ చేశారు. తొలుత మహమ్మద్ మిరాజ్తో పాటు మరో యువకుడు తనను రేప్ చేసినట్లు ఆ అమ్మాయి ఫిర్యాదులో పేర్కొన్నది. ఆ తర్వాత తన మేనమామ ఇంటికి వెళ్లాలని, ఆయన ఇద్దరు వ్యక్తులతో తనను ఇంటికి పంపించారని, అయితే ఆ ఇద్దరితో పాటు మరో వ్యక్తి కూడా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. మైనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్వరూప్ నగర్ పోలీసు స్టేషన్లో అయిదుగురిపై కేసు నమోదు చేశారు. మిరాజ్తో పాటు ఓ యువకుడిని గతంలోనే అరెస్టు చేశారు. కర్నన్, కమల్ అనే వ్యక్తులు పరారీలో ఉన్నారు. కర్నన్ ని మెయిన్పురిలో ప్లాన్ వేసి పట్టుకున్నారు. కర్నన్పై గతంలోనూ అయిదు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
గ్యాంగ్ రేప్ నిందితుడిని అరెస్టు
August 05, 2023
0
Tags