'జైలర్' పై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కేసు !

Telugu Lo Computer
0


జనీకాంత హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించగా మోహన్ లాల్, శివన్న క్యామియోలో నటించారు. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. వరుసగా 6 ప్లాపులు తరువాత రజనీ ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. విజయమే కాదు కలక్షన్స్ ను కూడా ఆ రేంజ్ లోనే రాబట్టింది. దాదాపు రూ. 600 కోట్లు రాబట్టి రజినీ సత్తా ఏంటో చూపించింది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఏ సినిమాలో అయినా ఎవరి మనోభావాలు దెబ్బతిన్న కోర్టు లో కేసు వేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఇక తాజాగా జైలర్ లో తమ టీమ్ ను అవమానించారని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (ఆర్సీబీ) కోర్టుకు ఎక్కింది. ఒక సీన్ లో ఒక కాంట్రాక్ట్ కిల్లర్ ఆర్సీబీ జెర్సీ వేసుకొని.. ఒక మహిళను అసభ్యకరమైన భాషతో వేధిస్తాడు. ఇక అది ఐపీఎల్ టీమ్ కు నచ్చలేదు. ఆర్సీబీ జెర్సీని వారు అవమానించినట్లు చిత్రీకరించారని, వెంటనే ఆ సీన్ ను డిలీట్ చేయాలనీ ఆర్సీబీ కోర్టులో కేసు వేసింది. ఇక ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు తీర్పును ఇచ్చింది. జెర్సీ ఉన్న సీన్ ను తొలగించాలని తెలుపుతూ జైలర్ మేకర్స్ కు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జైలర్ సినిమా చూశాం కానీ.. ఈ జెర్సీ ఎక్కడా కనిపించలేదు అని అంటారా .. రజినీ మనవడిని చంపడానికి ఇద్దరు కిల్లర్స్ వస్తారు.. అందులో ఒక వ్యక్తి.. రజినీ కోడలిపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తాడు కదా.. అతనే జెర్సీ వేసుకొని కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)