ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారిపై గురజాడ బైపాస్ వద్ద సోమవారం జరిగిన ప్రమాదంలో భార్య, భర్తలు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వైపు వెళ్తున్న కారు గురజాడ బైపాస్ వద్ద ప్రమాదవశాత్తూ డివైడర్ను ఢీకొంది. దీంతో కారు డ్రైవ్ చేస్తున్న ఉద్దండి బలాకర్ మోహన్ (55) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారులోని ఉద్దండి ఉమామహేశ్వరి(50)ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతులు భార్యాభర్తలని, వారిది తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా మునగనూరులోని యాదాద్రినగర్గా ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కృష్ణాజిల్లాలో ఎక్కడికి వెళ్లి వస్తుందనే వివరాలు తెలియలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. https://t.me/offerbazaramzon
రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం
July 18, 2023
0
Tags