ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని  శామీర్ పేట్ కీసర దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 66 కిమీ నెంబర్ వద్ద లారీ, టాటా ఏసీఈ, కారు పరస్పరం ఢీకొన్నాయి.. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయాని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ పరిస్థితులను పర్యవేక్షించారు. బోలేరో ట్రాలీ లో ఉన్న ఇద్దరు, లారీ డ్రైవర్ ఈ ప్రమాదంలో మరణించారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ నుండి మేడ్చల్ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ పైనుండి ఎగిరి ఎదురుగా వస్తున్న బొలెరో ట్రాలీ, కారును డీ కొట్టింది. కాగా, బొలెరోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు స్పాట్ లో మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.. మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించగా, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)