సీనియర్ సిటిజన్స్‌కు ఎస్‌బీఐ ఉయ్ కేర్ ఎఫ్‌డీ స్కీమ్ !

Telugu Lo Computer
0


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్ల కోసం ఒక మంచి స్కీమ్ అందిస్తోంది. దీని పేరు ఎస్‌బీఐ ఉయ్ కేర్ ఎఫ్‌డీ స్కీమ్. ఇందులో చేరితే అధిక వడ్డీ రేటు సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కేవలం సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. రూ. 2 కోట్ల వరకు మొత్తాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ అందిస్తున్న ఉయ్ కేర్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లో చేరితే 7.5 శాతం వడ్డీ రేటు సొంతం చేసుకోవచ్చు. రెగ్యులర్ కస్టమర్లతో పోలిస్తే 30 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ లభిస్తోంది. ఈ ఎఫ్‌డీ స్కీమ్‌లో చేరితే లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.5 శాతం ప్రకారం చూస్తే.. పదేళ్లలో డబ్బులు రెట్టింపు అవుతాయి. అంటే రూ. 5 లక్షలు పెడితే మెచ్యూరిటీ సమయంలో రూ.10 లక్షలకు పైగా పొందొచ్చు. రూ. 5 లక్షలకు రూ. 5.5 లక్షల వడ్డీ వస్తుంది. బ్యాంక్ సాధారణ కస్టమర్లకు పదేళ్ల టెన్యూర్‌పై 6.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 6.5 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. పదేళ్లలో రూ. 5 లక్షలు పెడితే రూ. 4.5 లక్షల వడ్డీ వస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 9.5 లక్షల వరకు పొందొచ్చు. అంటే దాదాపు రూ.లక్ష వరకు వ్యత్యాసం ఉంది. అందుకే వడ్డీ రేటు ఎక్కువగా ఉన్న బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం ఉత్తమం.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)