మర్మాంగం కోసుకుని బలవన్మరణం !

Telugu Lo Computer
0


సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దీక్షిత్ రెడ్డి(21) అనే యువకుడు తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా దేవరుప్పల గ్రామానికి చెందిన సోమిరెడ్డి, కరుణ దంపతులు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ శివారు పాపిరెడ్డినగర్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు దీక్షిత్ రెడ్డి ఉన్నారు. మానసిక స్థితి సరికా లేకపోవడంతో గతంలో దీక్షిత్ రెడ్డి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడికి వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే, తరచూ మందులు తినాల్సి వస్తుందని మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలోనే తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబసభ్యులు ఆదివారం బయటికి వెళ్లిన సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఆదివారం సాయంత్రం 5 గంటలకు తిరిగి రాగా  ఇంట్లో ఉన్న దీక్షిత్ రెడ్డి ఎంతకీ తలుపు తీయలేదు. కిటికీలోంచి చూడగా రక్తపు మడుగులో కనిపించాడు. వెంటనే కుటుంబసభ్యులు 108 సిబ్బందికి ఫోన్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి చూసేసరికి మర్మాంగం కోసుకుని అప్పటికే దీక్షిత్ మృతి చెందాడని గుర్తించారు. దీక్షిత్ రెడ్డి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. https://t.me/offerbazaramzon


Post a Comment

0Comments

Post a Comment (0)