మధ్యప్రదేశ్లోని కట్నీ నగరంలోని రెవెన్యూ విభాగంలో గజేంద్రసింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఓ పని నిమిత్తం తన వద్దకు వచ్చిన బార్ఖేడా గ్రామానికి చెందిన వ్యక్తిని రూ.5 వేల లంచం అడిగాడు. దీంతో సదరు వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి గజేంద్రసింగ్ చాంబర్లోకి వెళ్లి అతను అడిగిన రూ.5 వేల లంచం ఇస్తుండగా స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంట్రీ ఇచ్చారు. చేతిలో నోట్లతో అధికారులకు కనిపించేసరికి, వెంటనే గజేంద్రసింగ్ ఆ డబ్బులు మొత్తం అమాంతం నోట్లో కుక్కి నమిలి మింగేశాడు. ఈ ఊహించని పరిణామానికి నివ్వెరపోయిన అధికారులు వెంటనే అతని నోటిని తెరచి కరెన్సీ నోట్లను బయటికి తీయడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే గజేంద్రసింగ్ మెత్తగా నిమిలి మింగేశాడు. దీంతో అధికారులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి గజేంద్రకు ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ఈ వ్యవహారమంతా కెమెరాకు చిక్కడంతో అదికాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. https://t.me/offerbazaramzon
స్పెషల్ పోలీసులకు చిక్కకుండా కరెన్సీ నోట్లను నమిలి మింగిన అధికారి !
July 26, 2023
0
Tags