అప్సర మర్డర్ కేసులో సీన్ టు సీన్ వెల్లడించిన సాయికృష్ణ

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో సంచలనం రేపిన అప్సర మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సాయిని కస్టడీకి తీసుకున్న పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. ఈ క్రమంలో నిందితుడు సాయికృష్ణ అసలు అప్సరను చంపడానికి గల కారణాలను వెల్లడించాడు. దీనిని పోలీసులు స్టేట్ మెంట్ గా రికార్డ్ చేశారు. కస్టడీ ముగియడంతో తిరిగి కోర్టు ముందు సాయిని హాజరుపరిచారు. పెళ్లి చేసుకోవాలని అప్సర వేధించడంతోనే తాను ఈ హత్యకు పాల్పడినట్లు సాయికృష్ణ చెప్పాడు. పెళ్లి చేసుకోకుంటే తన పరువు బజారుకు ఈడుస్తానని అప్సర బెదిరించినట్లు చెప్పాడు. అప్పటికే తనకు పెళ్లి జరగడంతో ఈ విషయం బయటకు తెలిస్తే తన ప్రతిష్ట దెబ్బతింటుందనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇందుకోసం సాయికృష్ణ పక్కా ప్లాన్ ప్రకారమే అప్సరను ట్రాప్ చేసి తన కారులో తీసుకెళ్లాడు. అయితే ఆ యువతి మాత్రం సాయిపై అనుమానం కలగకపోవడంతో తాను కోయంబత్తూరు వెళ్తున్నట్టు తల్లికి చెప్పింది. ఈ క్రమంలో ఫోర్డు కారులో వెళ్తున్న క్రమంలో శంషాబాద్ దాటగానే రాళ్లగూడ వైపు కారు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అనంతరం అప్సర కారులోని ఫ్రంట్ సీటులో కూర్చుని రిలాక్స్ అవుతుంది. ఇంతలో మెల్లిగా నిద్రలోకి జారుకుంది. ఇక ఇదే అదునుగా భావించిన పూజారి సాయికృష్ణ తన వెంట తెచ్చుకున్న బెల్లం దంచే దుడ్డు కర్రతో తలపై దాడి చేసి చంపేశాడు. ఆ తరువాత అప్సర డెడ్ బాడీని అదే కారులో ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆరోజు మొత్తం పార్కింగ్ లో ఉన్న కారులో డెడ్ బాడీ ఉంచాడు. ఆ మరుసటి రోజు సరూర్ నగర్ లోని మ్యాన్ హోల్ లో అప్సర మృతదేహాన్ని సాయి పడేశాడు. ఆ తరువాత రెండు లోడ్ ల ఎర్రమట్టిని అక్కడ పోయించాడు. అలాగే రెండు బస్తాల ఉప్పును కూడా పోసి దుర్వాసన రాకుండా చూశాడు. అయినప్పటికీ దుర్వాసన రావడంతో కాంక్రీట్ తో ఆ మ్యాన్ హోల్ ను పూర్తిగా మూసివేశాడు. అయితే తన కూతురు కనిపించడం లేదని అప్సర తల్లి పోలీసులను ఆశ్రయించింది. అలాగే సాయి కూడా అప్సర కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించాడు. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు సీసీ కెమెరా ఆధారంగా సాయి తతంగాన్ని గుర్తించారు. సాయిని తమ శైలిలో ప్రశ్నించగా పోలీసులకు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. అప్సరను హత్య చేయడానికి పూజారి సాయికృష్ణ 15 రోజుల ముందే పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. ఆమెను ఎలా చంపాలి? శవాన్ని ఏం చేయాలి? ఆధారాలు దొరక్కుండా ఏం చేయాలి? ఇలా అన్ని అంశాలపై గూగుల్ , యూట్యూబ్ ను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో సాయికృష్ణ పూజలు చేసే బంగారు మైసమ్మ గుడి వెనక ఆసుపత్రి వద్ద 20 అడుగుల గుంతను తీయించాడు. అయితే ఆ గుంతను గమనించిన ఆసుపత్రి సిబ్బంది గుంత ఎందుకు తీశారని వారించడంతో ఆ గుంతను పూడ్చివేశారు. ఆ తరువాత తన ప్లాన్ మార్చి మ్యాన్ హోల్ లో మృతదేహాన్ని పడవేశాడు. కానీ ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక పొరపాటు చేస్తాడు. అలాగే సెయిల్ చేసిన తప్పిదమే అతడిని పట్టించి ఇప్పుడు కటకటాల పాలు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)