ఆంద్రప్రదేశ్ పిడుగురాళ్లకు చెందిన యువతి వాసవీ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంది. వారి బంధువు గణేష్ గచ్చిబౌలిలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. మాట్లాడాలని నార్సింగ్ లోని టీ గ్రీల్ హోటల్ వద్దకు పిలిపించిన యువకుడు, మాటల మధ్యలో ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. ఒక్క సారిగా బ్యాగ్ లో ఉన్న కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ ఘటనలో యువతికి మెడపై, చేతుల కు తీవ్ర గాయాలు అయ్యాయి. అది గమనించిన స్థానికులు యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.. ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.. కేసు నమోదు చేసుకొని యువతిని ఆసుపత్రికి తరలించారు. యువకుడి ఆచూకి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు..
యువతి పై కత్తితో దాడి చేసిన యువకుడు
June 21, 2023
0
Tags