కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పలు గ్యారంటీ పథకాలను ప్రకటించగా వాటికి దరఖాస్తు చేయడానికి ఆధార్, ఇతర ధృవపత్రాల అవసరం పెరిగింది. ఈ సమయంలో ఆధార్లో ఉన్న తప్పులను, చిరునామాలను మార్పించుకోవడం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయాలకు వస్తున్నారు. శనివారం రాయచూరు తహసీల్దార్ ఆఫీసులో గృహలక్ష్మి, గృహ జ్యోతి పథకాల కోసం ఆధార్ కార్డులో సవరణలు చేయించుకోవడానికి మహిళలు తరలివచ్చారు. అయితే ఇంటర్నెట్ సమస్య వల్ల కంప్యూటర్ పని ఆలస్యమైంది. దీంతో మహిళలు ఏకంగా కంప్యూటర్ గదిలో చొరబడడానికి ప్రయత్నించి పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ గందరగోళం చూసి అక్కడి మహిళా ఉద్యోగి భయపడిపోయి విలపించింది. వరుసలో రావాలని కోరినందుకు కొందరు దూషించారని ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను పై అధికారులకు తెలిపినా మౌనం వహించారని చెప్పారు.
ఆధార్ సెంటర్ లో ఏడ్చేసిన ఉద్యోగిని !
June 25, 2023
0
Tags