స్మగ్లింగ్‌ కేసులో ఇరుక్కుంది నేను కాదు !

Telugu Lo Computer
0


ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కేసులో ప్రముఖ టీవీ షో జబర్దస్త్‌ కమెడియన్‌ హరిబాబుపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితమే తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కేసులు అతనిపై నమోదయయ్యాయి. అయితే హరిబాబు మాత్రం పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నాడు. కొన్నేళ్లుగా పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. సోమవారం వైఎస్‌ హరిబాబుపై మరో స్మగ్లింగ్‌ కేసు నమోదైంది. దీంతో హరిబాబు పేరు మరొకసారి తెరపైకి వచ్చింది. ఈ విషయంపై మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే కొన్ని మీడియా సంస్థలు హరిబాబు బదులు జబర్దస్త్‌లో లేడీ గెటప్పులు వేస్తున్న గంపా హరికృష్ణ ఫొటోలను ప్రచురితం చేశాయి. సోషల్‌ మీడియాలో జబర్దస్త్‌ కమెడియన్‌ను ట్రోల్‌ చేస్తూ పోస్టులు దర్శనమిచ్చాయి. దీంతో గంపా హరికృష్ణ స్పందించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో ఇరుక్కుంది తాను కాదంటూ మొర్రో అంటూ క్లారిటీ ఇచ్చాడు. ‘స్మగ్లింగ్‌ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. 2013లో షకలక శంకర్‌ టీమ్‌లో వైఎస్‌ హరిబాబు పని చేశాడు. ఆ తర్వాత అతను ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. పోలీసుల విచారణలో అతను జబర్దస్త్‌ కామెడీ షోలో చేసినట్లు కూడా తేలింది. అప్పటికి నేను కూడా కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. అయితే ఇప్పుడు గూగుల్‌లో జబర్దస్త్‌ హరి పేరు కొడితే నా ఫొటోలు దర్శనమిస్తున్నాయి. దీంతో కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌ సైట్లు నా ఫొటోలతో స్మగ్లింగ్‌ ప్రచురితం చేశాయి. దీని వల్ల నేను చాలా సఫర్‌ అవుతున్నాను’ అని జబర్దస్త్‌ హరి చెప్పుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)