ఐఆర్‌సీటీసీ కాశీ యాత్ర !

Telugu Lo Computer
0


తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్‌సీటీసీ టూరిజం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఆపరేట్ చేస్తుంది.  పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో ఇప్పటికే ఐదు సార్లు ఈ టూర్ విజయవంతంగా పూర్తైంది. తెలుగు రాష్ట్రాల పర్యాటకుల నుంచి ఈ ఆధ్యాత్మిక యాత్రకు మంచి స్పందన వస్తోంది. జూన్ 28, జూలై 12, జూలై 26 తేదీల్లో పుణ్య క్షేత్ర యాత్ర టూర్ ప్యాకేజీ ప్రారంభం అవుతుందని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులు సికింద్రాబాద్‌, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం రైల్వే స్టేషన్లలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఎక్కవచ్చు. యాత్ర ప్యాకేజీ ధర రూ.15 వేల, ఇది 8 రాత్రులు, 9 రోజుల టూర్ ప్యాకేజీ. 9 రోజుల్లో పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ చూడొచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)