ఛత్తీస్ ఘడ్ లో ఎండల తీవ్రత తగ్గకపోవడంతో పాఠశాలలకు వేసవి సెలవులను ఈ నెల 26 వరకు ప్రభుత్వం పొడిగించింది. 16వ తేదీని పాఠశాలలు పున: ప్రారంభం కావాల్సి ఉండగా వేసవి తాపం, వడగాలులు తగ్గకపోవడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు భూపేష్ బాఘేల్ ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారం పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, దానితో పాటు వడగాలు సైతం విపరీతంగా ఉంటాయని రాష్ట్ర రాజధాని రాయ్పూర్లోని వాతావరణ శాఖ మంగళవారం అంచనా వేసింది. ఇదే కాకుండా రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా ఇది అంచనా వేసింది.
జూన్ 26 వరకు పాఠశాలలకు వేసవి సెలవుల పొడిగింపు !
June 14, 2023
0
Tags