228 కిలోల గంజాయి పట్టివేత

Telugu Lo Computer
0


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీడీఎల్ చౌరస్తాలో పోలీసుల తనిఖీలలో 228 కిలోల గంజాయి బయటపడింది. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నుండి మహారాష్ట్రకు తరలించే క్రమంలో శంకరపల్లి పోలీసులు వాహనాల తనిఖీలలో పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు సైద్ ఖాన్ షరీఫ్ ఖాన్, జావిద్ భవాని బొలెరో వాహనంలో నిషేధిత డ్రగ్స్ గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి బొలెరో వాహనంతో పాటు మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)