రూల్ ఈజ్ రూల్..రూల్ ఫర్ ఆల్ అనే విధంగా ఓ మహిళా కానిస్టేబుల్ తన విధులను నిర్వర్తించారు. ఏకంగా తమ బాస్నే అడ్డుకున్నారు. ఫోన్ లోపలికి అనుమతి లేదని బయట ఇచ్చిపోవాలని సూచించారు. ఫలితంగా సీపీ తన ఫోన్ ను ఆమెకు అప్పగించారు. ఎల్బీ నగర్లోని పదోతరగతి పరీక్షకేంద్రం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ ధైర్యానికి అక్కడున్నవారంతా షాక్కు గురయ్యారు. పదోతరగతి పరీక్ష పేపర్లు లీక్ కావడంతో మిగతా పరీక్షలన్నీ కట్టుదిట్టంగా జరిపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫోన్లను పరీక్షాకేంద్రాల్లోని తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని చెప్పిన మంత్రి. అధికారులు కూడా ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దీంతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఫోన్లను గేటు బయటే తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాచకొండ సీపీ చౌహాన్ ఎల్బీ నగర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడానికి వెళ్లారు. సీపీ ఫోన్తో లోపలికి వెళ్తుండగా ఓ లేడీ కానిస్టేబుల్ అడ్డుకున్నారు. ఫోన్ ఇచ్చేసి లోపలికి వెళ్లాలని కోరారు. దీంతో సీపీ ఫోన్ ఆమెకి అందించి పరీక్షకేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం బయటకు వచ్చి లేడీ కానిస్టేబుల్ను అభినందిచారు. రూల్స్ను కట్టుదిట్టంగా అమలు చేసినందుకు ఆమెకు రివార్డును కూడా అందించారు.
రూల్ ఈజ్ రూల్..రూల్ ఫర్ ఆల్ !
April 06, 2023
0
Tags