కర్ణాటకలో షీనా అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి దక్షిణ కన్నడ జిల్లాలోని సూలీయా తాలూకా గుత్తిగర్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఇంట్లో వండిన కోడి కూర మొత్తాన్ని షీనా తినేశాడు. ఆ తరువాత ఇంటికొచ్చిన కొడుకు శివరామన్కు కోడి కూర లేకపోవడం తో తండ్రితో గొడవపడ్డాడు. ఈ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన షీన, శివరామన్ ను కర్రతో గట్టిగా తలపై కొట్టాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
కొడుకును చంపేలా చేసిన కోడి కూర !
April 06, 2023
0
Tags