హర్యానాకు చెందిన నీలం అనే 23 ఏళ్ల యువతి ఉద్యోగం నిమిత్తం కెనడాకు వెళ్లింది. అయితే ఆమె కెనడాకు వెళ్లడానికి ముందే సునీల్ అనే వ్యక్తిని ప్రేమించింది. కెనడాకు వెళ్లిన తర్వాత అతడ్ని విడిచి ఎక్కువకాలం ఉండలేకపోయింది. నీతోనే కలిసి జీవితం పంచుకోవాలని ఉందని నీలం తెలిపింది. దీంతో గతేడాది జనవరిలో 'మనం పెళ్లి చేసుకుందాం, ఇండియాకి తిరిగొచ్చెయ్' అని సునీల్ చెప్పాడు. మరో క్షణం ఆలోచించకుండా.. ఆ యువతి భారత్కు వచ్చేసింది. భారత్కు తిరిగొచ్చిన తర్వాత నీలం ఒకరోజు హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆమెతో పాటు సునీల్ కూడా కొన్ని రోజుల పాటు మాయం అయ్యాడు. దాంతో.. నీలం కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వాళ్లిద్దరు ఎక్కడికైనా పారిపోయారేమోననుకొని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీలం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో నీలం ఫ్యామిలీ మెంబర్స్ హర్యానా హోంమంత్రిని కలిశారు. ఆయన సూచన మేరకు కేసుని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేశారు. ఆ ఏజెన్సీ ఈ కేసుని టేకప్ చేసుకున్న వెంటనే సునీల్ ఆచూకీ కనుగొని, అతడ్ని అరెస్ట్ చేసింది. తమదైన శైలిలో అధికారులు అతడ్ని విచారించారు. అప్పుడు అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తాను నీలంని కిడ్నాప్ చేసి, హతమార్చానని నేరం అంగీకరించాడు. ఆమె తలపై రెండుసార్లు కాల్చి చంపానని, మృతదేహాన్ని తన పొలంలో పాతిపెట్టానని తెలిపాడు. ఈ విచారణలో భాగంగానే సునీల్పై అరడజనకు పైగా హత్య కేసులు ఉన్నట్టు తేలింది.
కెనడా నుంచి నమ్మి వచ్చిన ప్రేయసిని కాల్చి చంపిన ప్రియుడు !
April 06, 2023
0
Tags