ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జి.సిగడాం మండలం మెట్టవలసలో 18 నెలల చిన్నారి సాత్విక వీధి కుక్కలకు బలి అయ్యింది. వీధిలో ఆడుకుంటున్న 18 నెలల చిన్నారిపై.. ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. కుక్కల దాడిని గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని వెంటనే చికిత్స కోసం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారికి ప్రథమ చికిత్స చేశారు. ఆతర్వాత మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి సాత్విక కన్నుమూసింది. పసిపాప మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.. కుక్కల నియంత్రణపై అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు..
వీధి కుక్కలకు మరో చిన్నారి బలి
April 22, 2023
0
Tags