వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో అయిదుగురికి నోటీసులు

Telugu Lo Computer
0


మాజీ మంత్రి వైయస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ఐదుగురు పులివెందుల వైసిపికి చెందిన వారికి సిబిఐ నోటీ-సులు జారీ చేసింది. ఇటీవల ఈ కేసులో దూకుడు పెంచిన సిబిఐ విచారణ వేగవంతం చేసింది. తాజాగా పులివెందుల చెందిన ఐదుగురికి నోటిఫికేషన్‌ జారీ చేయడం తాజా పరిణామంగా చెప్పుకోవచ్చు. హత్య జరిగిన రోజున వీరు వివేకాహత్యకేసు విచారణను ఎదుర్కొంటున్న అవినాష్‌ రెడ్డిని కలిసినట్లు  సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ (పిసిసి)కి చెందిన ఉద్యోగి సుధాకర్‌ను కడప సెంట్రల్‌ జైలులో విచారించారు. సుమారు రెండు గంటల పాటు సుధాకర్‌ను సిబిఐ విచారించినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాలతో పాటు వైయస్‌ భారతి వ్యక్తిగత కార్యదర్శి నవీన్‌కు మరోసారి సిబిఐ నోటీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో నవీన్‌ను కడప సెంట్రల్‌ జైల్లో విచారించడం జరిగింది. నవీన్‌ తరుపున్యాయవాది సుదర్శన్‌ రెడ్డి సెంట్రల్‌ జైల్లో సిబిఐ అధికారులను కలిసినట్లు సమాచారం నవీన్‌కు సంబంధించిన కుటుంబం వివరాలను లాయర్‌తో కలిసి సిబిఐకి నవీన్‌ సోదరుడు ఇచ్చినట్లు- తెలుస్తోంది. నవీన్‌కు మరోసారి నోటీ-సు ఇవ్వనున్నట్లు- కూడా తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)