ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేటకు చెందిన 9వ తరగతి విద్యార్దులు ఇద్దరు ఆటోను ఆపి చీరాల మండలం వాడరేవు సముద్రతీరంవైపు తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్ను కోరారు. డ్రైవర్ సరే అన్నాడు. అయితే ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో వారు ఆత్మహత్య గురించి మాట్లాడుకోవడాన్ని డ్రైవర్ విన్నాడు. దీంతో ఆటో డ్రైవర్ ఏసుబాబు ఆటోను నేరుగా పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లి వారిని పోలీసులకు అప్పగించాడు . పుస్తకాలు పోగోట్టుకోవడంతో.. తల్లిదండ్రులు తిడతారన్న భయంతో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు చీరాల వచ్చినట్టు పోలీసులకు విద్యార్దులు తెలిపారు. విద్యార్దులకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తి !
March 05, 2023
0
Tags