ఔరంగజేబును కీర్తిస్తూ వాట్సాప్ స్టేటస్ పెట్టిన వ్యక్తిపై కేసు !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర లోని కొల్హాపూర్ జిల్లాలో మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబును కీర్తిస్తూ తన వాట్సాప్‌లో స్టేటస్ పెట్టినందుకు ఒక మైనారిటీ మతానికి చెందిన వ్యక్తిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యాద్‌గావ్ పోలీసులు ఆ మైనారిటీ మతస్తుడిపై ఐపిసిలోని సెక్షన్ 295 కింద కేసు నమోదు చేశారు. ఔరంగజేబును కీర్తిస్తూ ఆ వ్యక్తి తన వాట్సాప్ స్టేటస్‌లో చేసిన వ్యాఖ్యలు మార్చి 16న వెలుగులోకి వచ్చినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు. సామాజిక మాధ్యమాలలో ఏ మతాన్ని కూడా కించపరుస్తూ ఎటువంటి పోస్టులు పెట్టవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)