కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరకుంటోంది. ఈ నెలాఖరులోగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో- ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలకు మరింత పదును పెడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య టాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పేరు తెర మీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల ప్రచారకర్తగా ఆయన నియమితులయ్యారు. రాయచూర్ జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు రాజమౌళి. జిల్లాలో పోలింగ్ సమయంలో ఓట్ల శాతాన్ని పెంచడానికి ఆయన సేవలను వినియోగించుకోనుంది కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.
కర్ణాటక ప్రచారకర్తగా రాజమౌళి
March 10, 2023
0
Tags