రవి శాస్త్రి వ్యాఖ్యలు చెత్తగా ఉన్నాయి

Telugu Lo Computer
0


బయటి వ్యక్తులు మూడో టెస్టు ఓటమి మాట్లాడడం సరికాదని కెప్టెన్ రోహిత్ శర్మ హితువు పలికారు. రెండు టెస్టుల్లో గెలిచి మూడో టెస్టులో టీమిండియా ఓడిపోవడంతో అతి విశ్వాసమే కొంపముంచిందని మాజీ కోచ్ రవి శాస్త్రి ఘాటుగా హెచ్చరించారు. దీంతో రవి వాఖ్యలకు రోహిత్ రీకౌంటర్ ఇచ్చారు. బయటి వ్యక్తులు చేసే వ్యాఖ్యలు చెత్తగా ఉన్నాయని బదులించారు. తాము రెండు మ్యాచ్‌లు గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్నామని, కొందరు మాత్ర అతి విశ్వాసం అనడం చెత్తగా ఉందని చురకలంటించారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్‌లో లేని వాళ్లకు. మా డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన విషయాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. బయట వ్యక్తులు చేసే వ్యాఖ్యలను అసలు పట్టించుకోనని చెప్పారు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు 2-1 తేడాతో ముందంజలో ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)