మూడో టెస్టు వేదిక ధర్మశాల నుంచి ఇండోర్‌ కు మార్పు !

Telugu Lo Computer
0


బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టులో సిరీస్‌లో మూడో టెస్టు వేధికను ధర్మశాల నుంచి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియానికి మార్చామని బిసిసిఐ వర్గాలు తెలిపాయి. ధర్మశాలలో ఔట్‌ ఫీల్డ్ సరిగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బిసిసిఐ ప్రకటనలో పేర్కొంది. బిసిసిఐ క్యురేటర్ తపోష్ ఛటర్జీ ఔట్ ఫీల్డ్‌ను తనిఖీ చేసి బోర్డుకు నివేదిక ఇచ్చాడు. మూడో టెస్టును విశాఖపట్నం లేదా బెంగళూరుకు తరలిస్తారని సమాచారం ఉంది. నాగ్‌పూర్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో టెస్టు ఫిబ్రవరి 17న ఢిల్లీలో జరగనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)