మహారాష్ట్రలోని తి పుణె జిల్లా భోర్ నుంచి కొంకణ్ కు అబ్దుల్ షేక్ కారులో వెలుతున్నాడు. వరందా ఘాట్ రోడ్లో ఉన్న వాఘ్జాయ్ గుడి వద్ద కారును ఆపాడు. చుట్టూ కోతులు ఉండడంతో వాటితో కలిసి సెల్ఫీ దిగాలని అతడు బావించాడు. వెంటనే జేబులోంచి సెల్ఫోన్ తీశాడు. కెమెరా ఆన్ చేసి సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. కోతుల గుంపుతో పాటు తనను కవర్ చేసుకోవాలని ప్రయత్నించి కొండ పై నుంచి జారీ లోయలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్థానిక సహ్యాద్రి రెస్క్యూ గ్రూప్ సహాయంతో పోలీసులు అతడి మృతదేహాన్ని బయటకు తీశారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరుగగా బుధవారం అతడి మృతదేహాన్ని 500 అడుగుల లోయలోంచి బయటకు తీసుకువచ్చారు. అబ్దుల్ మృతి చెందడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది.
సెల్ఫీ మోజు ప్రాణం తీసింది !
January 05, 2023
0
Tags