ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు హత్య చేస్తానని పోలీస్ కంట్రోల్ రూమ్కి బెదిరింపు వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం ఆ నెంబర్ ఆధారంగా ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాల్ చేసిన వ్యక్తి 38 ఏళ్ల మానసిక రుగ్మత ఉన్న వ్యక్తి జయ ప్రకాష్. అతను ముండ్కా నివాసి అని పోలీసులు తెలిపారు. నిందితుడు ఢిల్లీలోని గులాబీ బాగ్లో చికిత్స పొందుతున్నందున పోలీసులు అతన్ని అరెస్టు చేయలేదు. అయితే అతడిని విచారించే పనిలో పోలీసు బృందం నిమగ్నమై ఉంది. గతంలో కూడా కేజ్రీవాల్కు బెదిరింపులు వచ్చాయి. 2019లో అరవింద్ కేజ్రీవాల్ను చంపుతామని దుండగులు బెదిరించారు. కేజ్రీవాల్ కార్యాలయంలోని ఓ అనామక మెయిల్ ఐడీ నుంచి రెండు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇందులో అతడిని చంపేస్తానని బెదిరించారు. ఈ మెయిల్ తర్వాత ఢిల్లీ పోలీసు అధికారుల్లో కలకలం రేగింది. విషయం తీవ్రతను గమనించిన ఢిల్లీ పోలీసులు గుర్తు తెలియని నిందితులపై కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈమెయిల్ పంపిన వ్యక్తి సీఎంపై దాడికి దిగుతున్నట్లు బెదిరించే రీతిలో రాసుకున్నట్లు సమాచారం.
కేజ్రీవాల్ ను హత్య చేస్తానని పోలీస్ కంట్రోల్ రూమ్కి బెదిరింపు కాల్ !
January 31, 2023
0
Tags