మళ్లీ అధికారంలోకి రాగానే వాలంటీర్లకు జీతం పెంచుతాం !

Telugu Lo Computer
0


వైసీపీ మళ్లీ అధికారంలోకి రాగానే గ్రామ వాలంటీర్లకు రూ.15 వేల జీతం ఇవ్వనున్నట్లు మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్లు వివరించారు. కోనసీమ జిల్లా అల్లవరంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లతో ఆయన మీటింగ్ నిర్వహించారు. కష్టపడి పని చేసి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. వేరే పార్టీ రూలింగ్‌లోకి వస్తే వాలంటీర్ ఉద్యోగాలు తీసివేస్తుందని చెప్పుకొచ్చారు. అర్హత ఉండి, సంక్షేమ ఫలాలు పొందని వారు ఎవరైనా ఉంటే వారిని 6 నెలలకు ఒకసారి క్రాస్ వెరిఫై చేసి గుర్తించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించేలా జగన్ సర్కార్ చిత్తశుద్ధి చాటుతోందన్నారు. నియోజకవర్గ పరిధిలో 1200 మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. చెప్పినట్లుగా పెరిగిన పించన్ సొమ్మును జనవరి 2023 నుంచి ఇస్తున్నామన్నారు. పెన్షన్లు తీసివేయడమనేది తప్పుడు ప్రచారమని, ఎవరూ నమ్మొద్దన్నారు. 2019లో 39 లక్షలు ఉన్న పెన్షన్ల సంఖ్యను  64 లక్షలకు పెంచారన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)