కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడి తాలూకా మరళుదేవనపురలో విజయలక్ష్మీ బుధవారం గొర్రెలు మేపుతుండగా గొర్రెలపై చిరుత దాడి చేసింది. భయంతో విజయలక్ష్మీ చెట్టెక్కి ప్రాణాలు రక్షించుకుంది. చిరుత వెళ్లి పోయిన తరువాత చెట్టు దిగే క్రమంలో జారి కిందపడింది. దీంతో ఆమెకు నడుం విరిగింది. బాధితురాలిని కుటుంబ సభ్యులు మాగడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిరుతను బంధించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
చిరుత దాడిలో తప్పించుకునే క్రమంలో చెట్టుపై నుంచి కింద పడ్డ మహిళ !
January 27, 2023
0
Tags