తెలంగాణ లోని నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూరు వద్ద మంగళవారం రాత్రి రామకృష్ణ గౌడ్ అనే వాహనదారుడిని చిరుత పులి వెంబడించింది. ఊరుకొండ పేట నుంచి స్వగ్రామమైన వెల్దండకు వస్తున్న క్రమంలో రాచూర్ వద్ద వాహనానికి అడ్డు వచ్చిన చిరుత పులి కొద్ది దూరం వరకు వెంటపడిందని తెలిపారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు దృష్టికి తీసుకురాగా బుధవారం ఉదయం పాదముద్రలు సేకరించారు. కల్వకుర్తి వెల్దండ ప్రాంత ప్రజలు పశువుల కాపరులు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
వాహనదారుడి వెంటపడిన చిరుత
January 04, 2023
0