కర్ణాటకలోని మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని ఎ.నాగతిహళ్ళి వద్ద బెంగళూరు- మంగళూరు హైవే పై బెంగళూరు నుంచి హాసన్వైపు వెళుతున్న ఇన్నోవా కారు టైర్ పేలి అదుపు తప్పి, డివైడర్ను ఢీకొని అవతలి లేన్ మీదకు దూసుకెళ్లింది. అదే సమయంలో హాసన్ నుంచి బెంగళూరు వైపు వస్తున్న స్విఫ్ట్ కారు మీద ఇన్నోవా పడడంతో రెండు వాహనాలూ తుక్కు తుక్కయ్యాయి. స్విఫ్ట్లో ప్రయాణిస్తున్న హాసన్కు చెందిన జయంతి (60), శ్రీనివాస్ మూర్తి (60), ఇన్నోవాలోని చెన్నైకి చెందిన కిశోర్ (25), ప్రభాకర్ (75), మరొక 40 సంవత్సరాల వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆదిచుంచనగిరి ఆస్పత్రికి తరలించారు. బిండిగనవిలె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
కారు టైర్ పేలిన ప్రమాదంలో ఐదుగురు మృతి
December 13, 2022
0