తిరుమలలో పోటెత్తిన భక్తులు

Telugu Lo Computer
0


నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకి తిరుగిరులు ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్ కాంతులతో శ్రీవారి ఆలయం పండుగ శోభను సంతరించుకుంది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.40 గంటల నుంచి శ్రీవారి వైకుంఠద్వార దర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పండుగను పురస్కరించుకుని పుష్పాలతో తిరుమల పరిమళాలు వెదజల్లుతోంది. సోమవారం ఉదయం 5గంటల వరకు వీఐపీలకు, 5 నుంచి 6గంటల వరకు శ్రీవాణి భక్తులకు, ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగుతారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. న్యూఇయర్‌, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు భారీగా వస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే టిక్కెట్ల కోసం భారీగా క్యూ కట్టారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం క్యూలైన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, టికెట్ల జారీపై సరైన సమాచారం లేకపోవడంతో తోపులాట జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)