కర్ణాటకలో బీజేపీ ఒంటరిగానే పోరు !

Telugu Lo Computer
0


వచ్చే ఏడాది కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా. శనివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ''కర్ణాటకలో బీజేపీపై జేడీఎస్ అసత్య ప్రచారం చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్లతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. అవినీతి కోసం కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకుంటోంది. కానీ, బీజేపీ ప్రజల జీవితాల్ని మెరుగుపర్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇటీవల జరిగిన ఏడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 5 రాష్ట్రాల్లో అధికారం చేపట్టింది. ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది'' అని అమిత్ షా వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై అమిత్ షా దృష్టి కేంద్రీకరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)