ట్విట్టర్‌లో ప్రక్షాళన చేసే దిశగా అడుగులు ?

Telugu Lo Computer
0


ట్విట్టర్ కంపెనీ హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కంపెనీలో కీలక ఉద్యోగులను తొలగించడంతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను తొలగించి తానే ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు. తాజా అమెరికన్ మీడియా కథనాల ప్రకారం రానున్న రోజుల్లో ట్విట్టల్ నుంచి చాలా మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో కీలక చర్య దిశగా ఎలాన్ మస్క్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తన ఇతర కంపెనీల నుంచి ట్విట్టర్ లో పనిచేయడానికి ఉద్యోగులను తీసుకురానున్నట్లు సీఎన్‌బీసీ ఓ నివేదికలో తెలిపింది. మస్క్ కంపెనీ టెస్లా నుంచి 50 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆటోపైలెట్, బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్ నుంచి కూడా ఉద్యోగులను తీసుకోనున్నట్లు సమాచారం. టెస్లా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ అశోక్ ఎల్లుస్వామి, ఆటోపైలట్, టెస్లాబాట్ ఇంజనీరింగ్ డైరెక్టర్ మిలన్ కోవాక్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ డైరెక్టర్ మహా విర్దుహగిరిలతో పాటు ఎలాన్ మస్క్ బాగా విశ్వసించే వారిని ట్విట్టర్ లోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)