హైదరాబాద్ లో పలుచోట్ల పోలీసుల దాడులు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. ఎస్ఐబి , కౌంటర్ ఇంటలిజెన్స్, టాస్క్ ఫోర్స్ రైడ్స్ నిర్వహించారు. మూసారాంబాగ్ , బాబా నగర్, సైదాబాద్, సంతోష్ నగర్లలో అర్థరాత్రి రైడ్స్ జరిపారు. 15 ఇళ్ళల్లో సోదాలు జరిపి 20 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బేగంపేట్ బ్లాస్ట్ కేసులో పాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రహస్య ప్రదేశంలో విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే హైదరాబాద్‌ కుట్రకేసును భగ్నం చేశారు సిటీ పోలీసులు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతలతో పాటు పేలుళ్లకు కుట్ర చేశాడు జాహిద్‌. ఉగ్రవాద కార్యక్రమాల కోసం యువకులను రిక్రూట్‌మెంట్‌ చేసుకున్నాడు జాహిద్. ఇప్పటికే ఆరుగురు యువకులను ఉగ్రవాద సంస్థల కోసం రిక్రూట్మెంట్ చేశాడు జాహిద్‌. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పలు టెర్రర్‌ గ్రూపులతో జాహిద్‌కు లింకులు వున్నాయని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. గతంలో మక్కామసీదు పేలుళ్ల కేసులో సైతం జాహిద్‌ను ప్రశ్నించారు పోలీసులు. దేశంలో ఏ చిన్న సంఘటన జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లో వున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)