ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ లో భారీ తగ్గింపు!

Telugu Lo Computer
0


ఫ్లిప్‌కార్ట్ మరో డిస్కౌంట్ సేల్‌ను ప్రకటిచింది. బిగ్ దీపావళి సేల్‌ తీసుకువచ్చింది. ఈ సేల్ అక్టోబర్ 11 నుంచి 16 వరకు అందుబాటులో ఉంటుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అయితే ఈ సేల్ ఒక రోజు ముందే ప్రారంభం అవుతుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐతో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బ్యాంకుల కస్టమర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. పేటీఎం యూజర్లు కూడా 10 శాతం క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా కస్టమర్లు 80 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. ప్రింటర్లు, మానిటర్స్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. కెమెరాలు, యాక్ససిరీస్‌పై కూడా ఇదే స్థాయిలో డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. టీవీలు, అప్లయెన్సెస్‌పై 75 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. 4కే అల్ట్రా హెచ్‌డీ టీవీల ధర రూ. 17,249 నుంచి ప్రారంభం కానుంది. వాషింగ్ మెషీన్ల ధర రూ. 6,990 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏసీలపై అయితే 55 శాతం తగ్గింపు పొందొచ్చు. స్మార్ట్ టీవీల ధర రూ. 7,199 నుంచి ప్రారంభం అవుతోంది. ఫ్యాషన్ ప్రొడక్టులపై 60 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గింపు లభించనుంది. బ్యూటీ, ఫుడ్ ,టాయ్స్ ధర రూ.99 నుంచి ప్రారంభం అవుతోంది. ఫ్లిప్‌కార్ట్ ఒరిజినల్స్‌పై కూడా 80 శాతం తగ్గింపు లభిస్తోంది. మ్యాట్రసెస్‌పై కనీసం 50 శాతం తగ్గింపు పొందొచ్చు. సోఫా, సోఫా సెట్స్‌పై కూడా ఇదే తగ్గింపు పొందొచ్చు. బెస్ట్ సెల్లింగ్ బెడ్స్‌పై 80 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. చైర్స్ అండ్ టేబుల్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.   క్రేజీ డీల్స్, రష్ అవర్స్, టిక్ టాక్ డీల్స్ వంటివి ఉంటాయి. ఇంకా మూడు కొంటే 5 శాతం అదనపు తగ్గింపు, 5 కొంటే 10 శాతం అదనపు డిస్కౌంట్ వంటి ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి కూడా సొంతం చేసుకోవచ్చు. ఇలా ఆన్‌లైన్ షాపింగ్ చేయాలని భావించే వారికి సేల్‌లో పలు ఆఫర్లు పొందొచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)