పశ్చిమ బంగాల్లోని సాగర్దిగీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ 28 ఏళ్ల అసబుల్ మొల్లా అనే యువకుడ్ని వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన కొన్నిరోజుల వరకు బాగానే ఉన్న అతడు, ఆ తర్వాత ఇంట్లో నుంచి నగలతో పరారయ్యాడు.. తనను భర్త మోసం చేశాడంటూ సాగర్దిగీ పోలీస్ స్టేషన్లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది.. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు.. తీగ లాగితే డొంక కదిలినట్టు మొత్తం వ్యవహారం బయటపడింది. ఫేక్ ఐడీ కార్డులు సృష్టించి బీహార్, పశ్చిమ బంగాల్లో తిరిగే ఈ అసబుల్.. ఒక చోట తనకు ఎవరూ లేరని, మరోచోట జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నానని, ఇంకో చోట కూలీ పనే ఆధారమని, వేరేచోట ఉద్యోగం చేస్తానని.. ఇలా తనకు తోచింది చెప్పడం, ప్రేమ పేరుతో వల విసరడం, పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ప్లాన్ ప్రకారం జంప్ అవ్వడం, ఇలా 24 పెళ్లిళ్లు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పెళ్లి జరిగిన కొన్నాళ్లపాటు వారితో నమ్మకంగా ఉండి, అందినకాడికి నగలు, నగదుతో ఉడాయించడమే పనిగా పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇలా ఇప్పటికే 23 మందిని మోసం చేసిన ఈ కేటు గాడు.. సాగర్దిగీ ప్రాంతానికి చెందిన మహిళను 24వ పెళ్లి చేసుకున్నాడు.. అక్కడ కూడా అదే రిపీట్ చేశాడు.. కానీ, ఈ సారి బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో మొత్తం గుట్టు బయటపడింది.. ఇక, పరగణాస్ జిల్లా దత్తోపుకుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి పలు సిమ్ కార్డులు, నకిలీ సర్టిఫికెట్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతడిని జంగీపూర్ కోర్టులో హాజరుపర్చారు.. అక్కడి నుంచి ఏడు రోజుల రిమాండ్కు తరలించారు. అతను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్లోని కాజీపడ ప్రాంతానికి చెందినవాడని విచారణలో పోలీసులు గుర్తించారు .
28 ఏళ్లు - 24 పెళ్లిళ్లు....!
October 01, 2022
0