భర్త మర్మాంగం కోసిన భార్య !

Telugu Lo Computer
0


చత్తీస్ గఢ్ లోని దుర్గా జిల్లాలో అనంత్ సోన్వాని అలియాస్ అనంత్ (40) అనే వ్యక్తి  కొన్ని సంవత్సరాల క్రితం సంగీతా అనే యువతితో అనంత్ పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. సంగీతా నల్లగా ఉండటంతో అనంత్ పెళ్లి చేసుకుంటాడో చేసుకోడో ? అసలు పెళ్లికి అంగీకరిస్తాడో లేదో ? అని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. వివాహం చేసుకోవడం ఇష్టమే అని అనంత్, సంగీతా వాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పారు. పెళ్లికూడా ఇద్దరూ చాలా సంతోషంగా చేసుకున్నారు. భర్త అనంత్ కంటే అతని భార్య సంగీతా నల్లగా ఉంటుంది. వివాహం జరిగిన తరువాత అనంత్ అతని భార్య సంగీతాను నువ్వు బ్లాక్ బ్యూటీ, నల్లరాయిలా, బండరాయిలా ఉంటావు అంటూ అప్పుడప్పుడు ఆటపట్టించేవాడు. అనంత్ తనను కావాలని ఆటపట్టిస్తున్నాడని మొదట్లో సంగీతా పెద్దగా పట్టించుకోలేదు. అయితే రానురాను అనంత్ అందరి ముందు అతని భార్య సంగీతాను నువ్వు చాలా నల్లగా ఉన్నావు, నిన్ను ముట్టుకోవాంటే అసహ్యంగా ఉంటుంది, నీతో కళ్లు మూసుకుని కాపురం చేస్తున్నాను అంటూ ఆమెను చాలా చులకనగా మాట్లాడటం మొదలు పెట్టాడు. చాలాకాలం నుంచి ఓపికగా ఉంటున్న సంగీతా ఆమె భర్త అనంత్ మీద రగిలిపోయింది. రెండు మూడుసార్లు అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన సంగీతాను రాజీచేసిన పెద్దలు మళ్లీ ఆమె భర్త అనంత్ ఇంటికి పంపించారు. అయితే అనంత్ మాత్రం అతని భార్య సంగీతా కలర్ విషయంలో ఆమెను చులకనగానే మాట్లాడుతున్నాడు. మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన అనంత్ ఓసేయ్ కర్రిదానా అంటూ అతని నోటిదురుసుతో అతని భార్య సంగీతాను నోటికి వచ్చినట్లు తిట్టి భోజనం చేసి నిద్రపోయాడు. కోపం తట్టుకోలేని సంగీతా కొడవలి తీసుకుని నిద్రపోతున్న ఆమె భర్త అనంత్ మర్మాంగం కోసేయడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్య చర్మం గురించి చీఫ్ గా మాట్లాడుతున్న అనంత్ మర్మాంగాన్ని కోసేసిన సంగీతా అతన్ని హత్య చెయ్యడం చత్తీస్ గఢ్ లో కలకలం రేపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)