ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారికి నోటీసులు

Telugu Lo Computer
0


కేరళలోని కొచ్చిలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్‌ పోలీస్ (ఏసీపీ) ట్రాఫిక్ వెస్ట్, వినోద్ పిళ్లై కొచ్చిలోని క్వీన్స్‌ వాక్‌ వేలో ఇటీవల ఉదయం వేళ వాక్‌ చేస్తున్నారు. దీని కోసం ట్రాఫిక్‌ సిబ్బంది ఆ రోడ్డును బ్లాక్‌ చేస్తున్నారు. కాగా, క్వీన్స్‌ వాక్‌ వేలో పిల్లల సైక్లింగ్‌, స్కేటింగ్‌ కోసం కేవలం ఆదివారం మాత్రమే ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఒక భాగం రోడ్డును మూసివేస్తారు. అయితే ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారి వినోద్ పిళ్లై మార్నింగ్‌ వాక్‌ కోసం ఇటీవల ప్రతి రోజూ దీనిని బ్లాక్‌ చేస్తున్నారు. అంతేగాక ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం స్కూళ్లకు వెళ్లే పిల్లలు, వారిని బస్సుల్లో ఎక్కించే తల్లిదండ్రులతోపాటు ఉద్యోగాలకు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. ఇది సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారికి దీనిపై నోటీసులు జారీ చేశారు. గత నెలలో ఢిల్లీలో ఒక ఐఏఎస్‌ అధికారి తన భార్య, పెంపుడు కుక్కతో ఈవినింగ్‌ వాక్‌ కోసం త్యాగరాజ్‌ స్టేడియంలోని క్రీడాకారులు, శిక్షకులను ముందుగానే బయటకు పంపివేస్తున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) సంజీవ్ ఖిర్వార్‌ను లడఖ్‌కు ఆయన భార్య, ఐఏఎస్‌ అధికారిణి రింకు దుగ్గాను అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)