మాల్దీవుల్లో యోగా డే మీద దుండగుల దాడి

Telugu Lo Computer
0


మాల్దీవుల్లో జరిగిన యోగా డే కార్యక్రమంపై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు. గలోల్హు స్టేడియంలో యోగా చేస్తున్న సమయంలో గుంపులుగా దూసుకొచ్చిన దుండగులు కర్రలతో దాడికి ప్రయత్నించారు. నాటకీయ పరిణామాల మధ్య యోగా చేస్తున్నవారు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. అయితే, దాడి అనంతరం ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న తర్వాత కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. యువజన, క్రీడలు, కమ్యూనిటీ సాధికారత మంత్రిత్వ శాఖ, యూఎన్ మాల్దీవులతో పాటు మాల్దీవుల్లోని భారత హైకమిషన్ ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.  "ఈ ఉదయం గలోల్హు స్టేడియంలో జరిగిన సంఘటనపై మాల్దీవుల పోలీసులచే దర్యాప్తు ప్రారంభించాము" అని మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ అన్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని, బాధ్యులను త్వరగా చట్టం ముందు ప్రవేశపెడతామని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)