ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన తన ఇంటిలోనే ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అవంతి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అవంతి వైసీపీ టికెట్పై భీమిలి నుంచి పోటీకి దిగి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో జగన్ తొలి కేబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా అవంతికి అవకాశం దక్కింది. ఇటీవలే జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అవంతి మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
అవంతి శ్రీనివాస్కు కరోనా
June 23, 2022
0
Tags