నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

Telugu Lo Computer
0


తమిళనాడులోని సేలం జిల్లా వరగూరు ప్రాంతానికి చెందిన రాజా ఏకైక కుమార్తె రమ్య (21). స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీఎస్సీ నాలుగో సంవత్సరం చదువుతోంది. మరో మూడు నెలల్లో ఈ కోర్సు ముగియాల్సి ఉంది. ఈ క్రమంలో మేనమామతో రమ్య పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ పెళ్లి తనకు ఇష్టంలేదని చెప్పినప్పటికీ తల్లిదండ్రులు వినిపించుకోలేదు. దీంతో తన స్నేహితురాలికి మెసేజ్‌ పంపించి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)