టీఎస్ఆర్టీసీ చే రూ.300 దర్శనం టిక్కెట్ల జారీ !

Telugu Lo Computer
0


తిరుమల తిరుపతి వెళ్లే భక్తులు టిఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే వారికి టికెట్ తో పాటుగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు టోకెన్ లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ తిరుమల తిరుపతి దేవస్థానం తో ఒక అంగీకారాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం 300 రూపాయల దర్శనం టికెట్లను టిఎస్ఆర్టిసి వెబ్ సైట్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తక్షణమే అమలులోకి వచ్చేలా రోజూ 1,000 మంది ప్రయాణికులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను జారీ చేయడానికి అనుమతినిచ్చింది. దీనివల్ల ఆర్టీసీకి యాత్రికుల ఆదరణ, సురక్షితమైన రవాణా మెరుగుపడుతుందని టీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. టిఎస్ఆర్టిసి వైస్ చైర్మన్ మరియు ఎండి వి సి సజ్జనార్ మాట్లాడుతూ, ఈ దర్శన టిక్కెట్లు పొందాలని అనుకున్నవారు ప్రయాణానికి రెండు రోజుల ముందు తెలంగాణ ఆర్టీసీ బస్సులో టికెట్ రిజర్వేషన్ చేసుకోవలసి ఉంటుందని వెల్లడించారు. ప్రయాణీకులు తప్పనిసరిగా రెండు డోసుల టీకా ధృవీకరణ పత్రాన్ని లేదా తేదీ దర్శనానికి 72 గంటలలోపు పొందిన కోవిడ్ -19 నెగటివ్ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా సమర్పించాలని తెలిపారు. ఈ అవకాశం కల్పించినందుకు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి రాజ రెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎండి సజ్జనార్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)